వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేనల ఉపసంహరణ లేదు: ఫెర్నాండెజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పి, 14 మంది ఉగ్రవాదులను భారత్‌కుఅప్పగించే వరకు సేనల మోహరింపును ఉపసంహరించే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ చెప్పారు.

సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌స్వస్తి చెప్పి, 14 మంది ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనేసేనల ఉపసంహరింపునకు సంబంధించిన చర్చ వస్తుందని ఆయన గురువారంవిలేకరులతో అన్నారు. పాకిస్థాన్‌పై సైన్య ప్రయోగం వుంటుందా అని అడిగితే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే సమస్య వుంటుందని, దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం వుంటుందని ఆయన సమాధానమిచ్చారు.

ఈ రెండు డిమాండ్ల కోసం భారత్‌ ఎంత కాలం నిరీక్షిస్తుందని అడిగితే నిరీక్షణ ఎంత కాలం అవసరమైతే అంత కాలమని, నిర్ణీత గడువేది ఇవ్వలేమని ఆయన జవాబిచ్చారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను మూసేయాలని పాకిస్థాన్‌ ఆదేశించినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించగా సీమాంతర ఉగ్రవాదంవిషయంలో, చొరబాట్లను ప్రోత్సహించే విషయంలో పాకిస్థాన్‌ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదని తమకు సమాచారం ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X