వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులూ కాస్త తగ్గండిః ఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వానికి - నక్సలైట్లకు మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని గమనించి పోలీసులు సంయమనం పాటించాలని పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు కోరారు. వార్‌ తో ప్రభుత్వం చర్చలు జరపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు సంయమనం పాటించాలని, అదే సమయంలో నక్సలైట్లు సాయుధపోరుకు స్వస్తి చెప్పాలను ఎమ్మెస్సార్‌ కరీంనగర్‌ లో జరిగిన విలేకర్ల సమావేశంలో పిలుపునిచ్చారు.

దశాబ్దాల ఈ సమస్యకు పరిష్కారం సాధించడంలో ఇరుపక్షాలు సర్దుబాటు ధోరణి చూపాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నక్సలైట్లతో జరుపుతున్న చర్చలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఎమ్మెస్సార్‌ అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రల ముఖ్యమంత్రులు నక్సలైట్ల సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇరువర్గాలు సంయమనం పాటిస్తే ఈ చర్చలు సఫలం అవుతాయనే నమ్మకం తనకున్నదని ఎమ్మెస్సార్‌ అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X