వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధీరూభాయ్‌ అంబానీకి గుండెపోటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బుద్ధులు చెప్పి ప్రవర్తనను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయుడే తప్పు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనారిటీ కూడా తీరని ముగ్గురు బాలికలపై రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ సమీపంలోని లింగాపూర్‌ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసుల కథనం ప్రకారం- సింహాచలంనాయుడు అనే ఉపాధ్యాయుడు ముగ్గురు పాఠశాలవిద్యార్థినులపై అత్యాచారం చేశాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెప్తే ఉరేసి చంపేస్తానని ఆ చిన్నారులను బెదిరించాడు. ఈ పాఠశాలలో 70 మందివిద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఒక ఉపాధ్యాయుడు శనివారంసెలవుపై వెళ్లాడు. ఆ రోజు సింహాచలం నాయుడు ఒక్కడే ఉన్నాడు. అతను శనివారంనాడు తమపై అత్యాచారం చేసినట్లు, బెదిరించినట్లు బాధితుల్లోఒకరైన తులసి చెప్తోంది.

కేసు నమోదు చేసి సింహాచలం నాయుడును పోలీసులుఅరెస్టు చేశారు. తులసి రక్తం మరకలు కడిగిన అటెండర్‌ మల్లమ్మ ఇందులో ప్రత్యక్షసాక్షి అని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ చెప్పారు. తాను అత్యాచారం చేయలేదని, అయితే చేయి పట్టుకుని గుంజడం తప్పేనని సింహాచలంనాయుడు ఒక ప్రైవేట్‌ టివీ ఛానల్‌తో అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X