వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని ప్రకటనపై ఫరూఖ్‌ నిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ఎన్నికలుస్వేచ్ఛగా, నిజాయితీగా జరగడానికి అవసరమైతే జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తామని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి లక్నోలో చేసిన ప్రకటన పట్ల ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి పాలన గానీ, గవర్నర్‌ పాలన గానీ విధించడానికి కేంద్రం వద్ద ఉన్న యంత్రాంగం లేదా రాజ్యాంగ అధికారాలు ఏమిటని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన విధించాలా, వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, గత ఎన్నికల సందర్భంలో గవర్నర్‌ పాలన ఉన్నదని, తాము ఎన్నికల్లోవిజయం సాధించామని, ఇప్పుడేమైందని ఆయన అన్నారు.

వారికి మా మీద నమ్మకం లేదా? బిజెపి పాలన ఉన్న గుజరాత్‌విషయంలో అదే చర్య ఎందుకు తీసుకోరు అని ఆగ్రహంగా అడిగారు. ఏమైనా మీడియా ప్రధాని నోటి మాటగా ప్రచారం చేస్తోందని, మీడియా ప్రతినిధులు కుచ్చి కుచ్చి ప్రశ్నలు అడుగుతారని, ప్రధాని అతి సాధారణంగా వ్యాఖ్యానించి వుంటారని, మీడియా దానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X