వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ పద్ధతి మారాలి: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:పీపుల్స్‌వార్‌తో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, చర్చలపై నక్సలైట్లకే చిత్తశుద్ధి లేదని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ డివిజన్‌లోని నర్సింహులపేటలో ఆయన సోమవారం పోలీసుస్టేషన్‌ భవనాన్ని ప్రారంభించారు.

ఓ వైపు చర్చలంటూనే మరో వైపు గ్రామాల్లోపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనాపీపుల్స్‌వార్‌ తన పద్ధతి మార్చుకుని చర్చలకు వస్తే ఫలితం వుంటుందని ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌ వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతున్న నేపథ్యంలో చర్చల ప్రతిపాదనను వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరిపి ప్రభుత్వంఅంగీకరించిందని ఆయన గుర్తు చేశారు. చర్చల వల్ల కలిగిన వెసులుబాటుతో ఆయుధాలతో తిరగడం, గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు నిర్వహించడం, తుపాకులతో బెదిరించి చందాలు వసూలు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులు చేయవద్దని, అలా చేస్తే ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోదని ఆనాడే చెప్పామని ఆయనవిలేకరులతో అన్నారు.

చర్చల సందర్భంగా పీపుల్స్‌వార్‌ ప్రజా సమస్యలను ముందుకు తెస్తే ప్రభుత్వం పరిష్కరిస్తుందని దేవేందర్‌ చెప్పారు. ఈ నెల 20వ తేదీనపీపుల్స్‌వార్‌ చర్చలకు వస్తే అందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని ఆయన అన్నారు. వరవరరావు, గద్దర్‌ కోరితే వారికి గన్‌మెన్‌ను
ఇస్తామని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ చర్చల గురించి,పీపుల్స్‌వార్‌ గురించి పోలీసులు పదే పదే ప్రకటనలు చేయడాన్ని మంత్రి సమర్థించారు. సంఘవిద్రోహ శక్తుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X