వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యతో కమలానికి కాంతిః అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తానని ఉపప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. వెంకయ్య నాయుడు సారధ్యంలో ఏర్పాటైన బిజెపి నూతన ఆఫీస్‌ బేరర్ల తొలి సమావేశంలో అద్వానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు అధికార పగ్గాలు చేపట్టడం చాలా సాఫీగా సాగిపోయిందని, మరే జాతీయ పార్టీలో కూడా ఇంత సునాయాసంగా కొత్తఅధ్యక్షుడు రావడం మనం చూడలేదని ఆయనఅన్నారు. వెంకయ్య నాయుడు సారధ్యంలో భారతీయ జనతా పార్టీకి 1980నాటి వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు,అరుణ్‌ జైట్లీ మంత్రిపదవులు త్యాగం చేసి పార్టీ అభివృద్ధి కోసం అంకితం కావడం అభినందనీయం అని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా వ్యవహరించి, పార్టీని కార్యోన్ముఖం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చేనెల 3న బిజెపి జాతీయ కార్యవర్గం సమావేశమై వెంకయ్యనాయుడు ఎన్నికను ధృవీకరించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X