వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకయ్యతో కమలానికి కాంతిః అద్వానీ
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తానని ఉపప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. వెంకయ్య నాయుడు సారధ్యంలో ఏర్పాటైన బిజెపి నూతన ఆఫీస్ బేరర్ల తొలి సమావేశంలో అద్వానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు అధికార పగ్గాలు చేపట్టడం చాలా సాఫీగా సాగిపోయిందని, మరే జాతీయ పార్టీలో కూడా ఇంత సునాయాసంగా కొత్తఅధ్యక్షుడు రావడం మనం చూడలేదని ఆయనఅన్నారు. వెంకయ్య నాయుడు సారధ్యంలో భారతీయ జనతా పార్టీకి 1980నాటి వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు,అరుణ్ జైట్లీ మంత్రిపదవులు త్యాగం చేసి పార్టీ అభివృద్ధి కోసం అంకితం కావడం అభినందనీయం అని ఆయన అన్నారు.
Story first published: Saturday, July 13, 2002, 23:53 [IST]