ఆర్థికాభివృద్ధిపై వాజ్పేయివిశ్వాసం
న్యూఢిల్లీ: పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశం ఎనిమిది శాతం ఆర్థికపెరుగుదలను సాధించగలదని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి విశ్వాసం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాల్లో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ఆరు దేశాల్లో భారత్ ఒకటని ఆయన చెప్పారు.
మార్కెట్ నియంత్రణ సమర్థ, స్వేచ్ఛాయుత నియంత్రణ సంస్థల ద్వారా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణపేరుతో అభివృద్ధికి ఆటంకంగా మారిన సమస్యలన్నిటినీ తొలగించాల్సిన అవసరం ఉన్నదని, పర్యావరణానికిదెబ్బ తగలకుండానే వాటిని తొలగించవచ్చునని ప్రధాని అన్నారు. జిడిపిని 8 శాతానికి, ఆ పైబడి పెంచడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. హామీలకు, అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వున్నదని ఆయన చెప్పారు. నియంత్రణ ప్రక్రియను సమూలంగా మార్పు చేయడానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
