వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పలకరింతలు... చతురోక్తులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఎప్పుడూ పరస్పరం విమర్శించుకొనే చంద్రబాబు - వైఎస్‌ కరచాలనాలు, హాస్యోక్తులు, రాజకీయ మంత్రాంగంతో సీరియస్‌ గా వుండే వివిధ పార్టీల నేతల ముఖాల్లో నవ్వులు, మంత్రుల చతురోక్తులు..... ఇవీ సోమవారం ఉదయం జూబ్లీ హాలులో కనిపించిన దృశ్యాలు. శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆనవాయితీగా స్పీకర్‌ ప్రతిభా భారతి వివిధ పార్టీల నేతలకు విందు ఇచ్చారు.

ఈ విందులో వివిధపార్టీలకు చెందిన నేతలు, మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.స్పీకర్‌ ప్రతిభా భారతి, డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌ రెడ్డి సభ్యులకుస్వాగతం పలికారు. ఆ తరువాత కొద్దిసేపటికి చంద్రబాబు నాయుడు, ఆ వెంటనే వై.ఎస్‌. వచ్చారు. ఇద్దరు నేతలు సాదరంగా పలకరించుకున్నారు.అంతా చలోక్తులు విసురుకుంటా అల్పాహారం తీసుకొనిఅసెంబ్లీ చేరుకున్నారు. అయితే ఈ విందు సమావేశానికిఎంఐఎం, సిపిఎం, టి.ఆర్‌.ఎస్‌. పార్టీలు దూరంగా వున్నాయి.
చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వస్తునే ముందు వరసలో వున్న వివిధ పార్టీల ఎమ్మెల్ల్యేలతో కరచాలనం చేశారు. కమలనాధులు కాషాయం రంగు కండువాలు ధరించగా, సిపిఎం నేత నోముల నర్సింహయ్య ఏకంగా ఎర్రచొక్కా ధరించి సమావేశానికిహాజరయ్యారు. ఇదిలా వుండగా నక్సలైట్ల కార్యకలాపాలు అధికం కావడం, ఐఎస్‌ఐ కదలికలు వుండండంతో ఈ సారిఅసెంబ్లీ సమావేశాలకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X