వాజ్‌ పేయి కొలువులో చేరనున్న మమత

న్యూఢిల్లీః తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వాజ్‌పేయి క్యాబినెట్‌ లో చేరే అవకాశాలు మెరుగైనాయి. తూర్పురైల్వే విభజనపై తన సహజశైలిలో కేంద్రంతో కయ్యానికి కాలుదువ్విన మమత కేంద్ర క్యాబినెట్‌ లో చేరేందుకు తొలుత ససేమిరా అన్నారు.పైగా రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వకపోతే కేంద్ర మంత్రిపదవి నాకుఅక్కరలేదని కరాఖండిగా చెప్పారు. ఈ లోగా తూర్పురైల్వే విభజన్‌ వ్యవహారం రావడంతో కేంద్రంపై కత్తి దూశారు. అయితే ఎన్టీఏ కన్వీనర్‌ జార్జి ఫెర్నాండెజ్‌ ఆమెకు నచ్చచెప్పడంతో ఆమె దారికివచ్చినట్లు భావిస్తున్నారు. ఆమె అలక మానిందనడానికి ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్డీఏ సమావేశానికి మమతహాజరు కావడమే నిదర్శనం అని చెబుతున్నారు.

సోమవారం ఉదయం కూడా మమత వాజ్‌పేయితో టెలిఫోన్‌ లో మాట్లాడారట. ఈ మధ్యకాలంలో మమత ఎన్టీఏ సమావేశానికిహాజరు కావడం ఇదే ప్రధమం. మమత క్యాబినెట్‌ లో చేరుతుందనే భావిస్తున్నానని ఫెర్నాండెజ్‌ చెప్పారు. ఆదివారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో తూర్పురైల్వే ప్రాజెక్టు విభజన అంశం ప్రస్తావనకు రాలేదని ఫెర్నాండెజ్‌ చెప్పారు. కోల్‌ కతా నుంచి కొత్తఢిల్లీ బయలుదేరడానికి ముందు మమతవిలేకర్లతో మాట్లాడుతూ రైల్వే జోన్‌ విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలనే
కేంద్ర నిర్ణయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్‌ లో చేరతారాఅ ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+