వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతికి చొరవచూపండి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రభుత్వానికి నక్సల్స్‌ మధ్య చర్చల ప్రక్రియ సఫలం కావాలని కోరుతున్న పీస్‌ ఇన్‌షియేటివ్‌ కమిటీ సోమవారం నాడు సిఎల్‌పి నేత వైఎస్‌ను, సిపిఎం నేత నోముల నర్సింహయ్యను కలుసుకున్నది. చర్చల అంశాన్ని సభలో లేవనెత్తాలని చర్చలకు విఘాతం కలిగిస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ప్రతిపక్ష నేతలకు పీస్‌ ఇనిషియేటివ్‌ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్‌ను ఇతరవిపక్ష నేతలను వారు కలిసారు. చర్చల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతపీపుల్స్‌ వార్‌ సంయమనంతో వున్నదని ప్రభుత్వమే దుడుకుగా వ్యవహరిస్తున్నదని కమిటీ కన్వీనర్‌ బొజ్జా తారకం ఆరోపించారు.సర్వీసు నిబంధనలకు విరుద్దంగా పోలీసు అధికారులు కూడా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ఆయనవిస్మయం వ్యక్తం చేశారు. చర్చలు జరుగుతుండగానే అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు డిజిపిపేర్వారం రాములు ఇజ్రాయెల్‌ వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.విపక్ష నేతలను కలిసిన వారిలో తారకంతోపాటుసీనియర్‌ పాత్రికేయులు వి హనుమంతరావు, ప్రొఫెసర్‌ చౌదరి, కాత్యాయని తదితరులు వున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X