హైదరాబాద్ః కలాం రాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయకు ఫోన్ చేసి ఆభినందనలు తెలిపారు. కలాం విజయం ఖాయమని అందరికీ ముందే తెలుసునని ఆయన అన్నారు.
కలాం విజయం వల్ల దేశంలో సాంకేతిక,విజ్ఞాన శాస్త్రాలు మరింత శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం వున్నదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతల నిర్వహణలో ఆయనకు అన్నీ శుభాలే జరగాలని తాము కోరుతున్నట్టుగా బాబు చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవికి తాము షెకావత్ను సమర్ధిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.