వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దలకు కలాం కృతజ్ఞతలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః రాష్ట్రపతి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వార్త తెలిసిన వెంటనే అబ్దుల్‌ కలాం ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆయనకు ఈ వార్తను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌మహాజన్‌ చేరవేశారు. మహాజన్‌ ఓట్ల కౌంటింగ్‌లో కలాం ఏజెంట్‌గా వ్యవహరించారు.

ఫలితాలు వెలువడిన వెంటనే మహాజన్‌ హుటాహుటీన కలాం ఇంటికి వెళ్లి శుభవార్తను తెలియజేసిమిఠాయి తినిపించారు. ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా తన తల్లితండ్రులకు,విద్య గరిపిన గురువులకు, ఉద్యోగ పర్వంలో మార్గదర్శకత్వం వహించిన ముగ్గురు మేటి శాస్త్రవేత్తలు, సారాభాయ్‌, సతీష్‌ ధావన్‌, బ్రహ్మప్రకాష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత పదిహేనేళ్లుగా తాను ప్రభుత్వంలో ప్రత్యక్ష్యంగా పనిచేస్తున్నానని వివిధ రంగాల అభివృద్ధిలో ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రభావం ఎంతగా వుంటుందో తనకు బాగా తెలుసుననిఆయన చెప్పారు. ప్రభుత్వ పరంగా దేశ అభివృద్ధికి తాను శాయశక్తుల కృషి చేస్తానని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X