వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్యప్రాణి దత్తతకు లక్షవిరాళం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు, సంస్ధలు భాగస్వాములు కావాలని రాష్ట్రఅటవీ, పర్యావరణ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ చేసిన సూచనకు మంచి ప్రతిస్పందన వస్తున్నది. వన్యప్రాణి దత్తత పథకానికి జీడిమెట్ల అఫ్లుయెంట్‌ ట్రీట్‌ మెంట్‌ లిమిటెడ్‌
మేనేజింగ్‌ డైరెక్టర్‌ జికెబి చౌదరి లక్ష రూపాయల విరాళాన్ని గురువారం నాడు అందజేసినట్టు నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ బి.శ్రీనివాస్‌ ఒకప్రకటనలో తెలిపారు.

వన్యప్రాణి దత్తత పథకానికి ఇదే మొదటి విరాళమని ఆయన తెలిపారు. ఒక పులిని ఏడాది పాటు జీడిమెట్లు అఫ్లుయెంట్‌ ట్రీట్‌ మెంట్‌ లిమిటెడ్‌ దత్తత తీసుకుంది. ఏ పులిని దత్తత తీసుకోవాలో జూను సందర్శించిన అనంతరం చౌదరి నిర్ణయించుకుంటారు. జంతు ప్రదర్శన శాలల్లో జంతువుల పోషణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎటూ సరిపోవడం లేదని వార్తలు వస్తున్న నేపధ్యంలో వన్యప్రాణి దత్తత పథకానికి మంచి స్పందన రావడం పట్ల వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X