వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి చైర్మన్‌ పై అట్టుడికినఅసెంబ్లీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవిశాఖ విజయాడైరీ చైర్మన్‌ తులసీరావును తెలుగుదేశం ప్రభుత్వం నెత్తికి ఎత్తుకుంటున్నదని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. అవినీతిలోపీకలదాకా కూరుకుపోయిన తులసీరావును ఎమ్మెల్ల్యేలతో పాటు చైనా యాత్రకు ఎందుకు పంపారంటూ సి.ఎల్‌.పి.నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ధ్వజం ఎత్తారు. డైరీని సొంతఆస్తిలా వాడుకుంటూ కోట్లుస్వాహా చేస్తున్న తులసీరావును ప్రభుత్వం ఎందుకు ప్రజలడబ్బుతో చైనా పంపిందని ఆయన దుయ్యబట్టారు. ఆయన అవినీతిపై సభా సంఘాన్ని నియమించాలని కూడా డిమాండ్‌ చేశారు.

సహకార సంఘాల చట్టం పరిధిలో ఆయనపైవిచారణ జరుపుతున్నామంటూ మంత్రి ఇచ్చిన వివరణ పట్ల సభ్యులు సంతృప్తి చెందలేదు. దీంతో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని తులసీరావువిశాఖలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, చైనాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వచ్చేందుకు ఆయనను అక్కడికి పంపామని చెప్పారు. పాల ఉత్పత్తి నామమాత్రంగా వుండే చైనా, ధాయ్‌ లాండ్‌ కు ప్రజల డబ్బుతో తులసీరావును పంపడం,పైగా ఆయన అవినీతి పనులను ముఖ్యమంత్రిస్వయంగా వెనకేసుకురావడం సిగ్గుచేటని వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి అన్నారు. దీనికిప్రతిపక్ష సభ్యులు బల్లలు చరిచి ప్రభుత్వాన్ని గేలి చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X