వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవినీతి చైర్మన్ పై అట్టుడికినఅసెంబ్లీ
హైదరాబాద్ః పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవిశాఖ విజయాడైరీ చైర్మన్ తులసీరావును తెలుగుదేశం ప్రభుత్వం నెత్తికి ఎత్తుకుంటున్నదని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అవినీతిలోపీకలదాకా కూరుకుపోయిన తులసీరావును ఎమ్మెల్ల్యేలతో పాటు చైనా యాత్రకు ఎందుకు పంపారంటూ సి.ఎల్.పి.నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధ్వజం ఎత్తారు. డైరీని సొంతఆస్తిలా వాడుకుంటూ కోట్లుస్వాహా చేస్తున్న తులసీరావును ప్రభుత్వం ఎందుకు ప్రజలడబ్బుతో చైనా పంపిందని ఆయన దుయ్యబట్టారు. ఆయన అవినీతిపై సభా సంఘాన్ని నియమించాలని కూడా డిమాండ్ చేశారు.
Comments
Story first published: Friday, July 19, 2002, 23:53 [IST]