వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కారు వైఖరిలో మార్పులేదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః నక్సలైట్లతో చర్చల విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఏలాంటిమార్పు లేదని హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్‌ నక్సల్స్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం మాత్రం చర్చలకు తలుపులు ద్వారాలు తెరిచే వుంచిందని ఆయన చెప్పారు.

గత రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో నేరుగా వార్‌ నేతలతోనే చర్చలు జరపాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. 20 తారీఖు గడవు నక్సల్స్‌ చెప్పిందేనని ప్రభుత్వం ప్రకటించింది కాదని ఆయనవివరించారు. నక్సల్స్‌ ఆయుధాలు విడిస్తేనే ఎన్‌కౌంటర్లు నిలిచిపోతాయని ఆయన చెప్పారు. చర్చలకు అనుకూలమైన వాతావరణం కావాలంటే నక్సల్స్‌ ఆయుధాలు వదిలిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X