వైగో విడుదలకుజార్జ్ పైరవీ
న్యూఢిల్లీఃరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలనుభూకక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంతోపోలుస్తూ చమత్కరించిన ప్రమోద్ మహాజన్రాజ్యసభలో క్షమాపణలు చెప్పుకున్నారు.భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపైతనకెంతో గౌరవం వున్నదని ఆయనస్పష్టం చేశారు. గురువారం నాడు రాష్ట్రపతిగా అబ్దుల్కలాం ఎన్నిక వార్త వెల్లడయిన తర్వాతప్రమోద్ మహాజన్ మాట్లాడుతూ, ఒకఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగాప్రవేశపెట్టామని, మరో ఉపగ్రహాన్ని(ఉపరాష్ట్రపతి) కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి వున్నదనివ్యాఖ్యానించారు.దీనిపైరాజ్యసభలో తీవ్ర గందరగోళంచెలరేగింది. కాంగ్రెస్ సభ్యుడు మన్మోహన్సింగ్మాట్లాడుతూ, మహాజన్ వ్యాఖ్యలుఅత్యున్నత పదవులను కించపరిచే విధంగావున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతులను రిమోట్లతో ఉపగ్రాహాలనునియంత్రించినట్టుగా నియంత్రించవచ్చనిప్రమోద్ మహాజన్ భావిస్తున్నారా అని ఆయనప్రశ్నించారు.