భారత్‌ పై దాడికిమిలిటెంట్లు సిద్ధం

న్యూఢిల్లీః భారత్‌ పై దాడి చేసే లక్ష్యంతో వందలాది మంది ఆఫ్ఘన్‌ తీవ్రవాదులు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో సిద్ధంగా వున్నారు. ఆందోళన కలిగించే ఈ వివరాలను పాకిస్తాన్‌ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబాన్‌ ప్రభుత్వం పతనం అయ్యాక ఈ మిలిటెంట్లు అంతా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ కు పారిపోయి వచ్చారు. ఈ మిలిటెంట్లు నిషేధిత లష్కర్‌ ఎతోయిబా, జైషే మహమ్మద్‌,హర్కతులు మొజాహిద్దీన్‌ సంస్థలకు చెందిన వారేనని అనుమానిస్తున్నారు.

పాకిస్తాన్‌ లో ఈ సంస్థలపై దాడులు జరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నదని, వారంతా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పారిపోయి వేరేపేర్లతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని న్యూస్‌ లైన్‌ వారపత్రికపేర్కొన్నది. ఈ తీవ్రవాద సంస్థలన్నీ అదను చూసుకొని భారత్‌ పైపెద్ద ఎత్తున దాడికి సన్నాహాలు చేస్తున్నాయని కూడా ఆ పత్రికపేర్కొన్నది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+