వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణ కూడా టైగర్ల భక్తుడేః జయ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః తమిళనాడును విభజించాలనే డిమాండ్‌ చాలా ప్రమాదకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడును విభజించాలంటూ పిఎంకె నాయకుడు డాక్టర్‌ రాందాస్‌ డిమాండ్‌ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. రాందాస్‌ నిజస్వరూపం దీంతోఅర్థం అవుతుందని ఆమె ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తప్పు పట్టారు. పిఎంకె నేత రాందాస్‌కు, ఎండిఎంకె నేత వైకోకు, డిఎంకె నేత కరుణానిధికి, తమిళ జాతీయ ఉద్యమ నాయకుడు నెడుమారన్‌ కు తమిళటైగర్లతో ప్రత్యక్షంగాకానీ పరోక్షంగా కానీ సంబంధాలున్నాయని ఆమె తీవ్రంగావిమర్శించారు.

తమిళనాడులో పూర్తిగా వెనుకబడిన వన్నియా కులస్తుల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా రాందాస్‌ డిమాండ్‌ చేశారు. కులతత్వాన్ని, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడంలో రాందాస్‌అందవేసిన చేయ్యి అని ఆమె దుయ్యబట్టారు. ప్రమాదకరమైన ఇటువంటి డిమాండ్లు మానుకోవాలని ఆమె హెచ్చరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X