వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పంకు బాబుహైటెక్‌ మెరుగులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నియోజకవర్గంఅయిన కుప్పం హైటెక్‌ గా మారనుంది. రాజీవ్‌ గాంధి అమేధీని ఆధునికంగా తీర్చిదిద్దిన తరహాలో చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నియోజకవర్గంలోని 107 గ్రామపంచాయతీలను అనుసంధానం చేయాలని,సెప్టెంబర్‌ నాటికల్లా నగరాలకే పరిమితం అయిన ఇసేవా సర్వీసులను అన్ని గ్రామాలకు అందించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

బ్రిటన్‌ కు చెందిన ఇంటర్నేషనల్‌ డవలప్‌ మెంట్‌ సంస్థకు ఈ గ్రామాలను అనుసంధానం చేసే బాధ్యతనుఅప్పగించారు. ఇందుకోసం 3.3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడి కుడిభుజంగా చెప్పుకొనే ప్రొఫెసర్‌ వి. లక్ష్మీపతి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్‌ లను ఏర్పాటు చేస్తారు.వీటన్నింటినీ సర్వర్‌ కు లింక్‌ చేస్తారు. పైగా కుప్పంపై తెలుగులో ఒక పోర్టల్‌ కూడా రూపొందించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. కుప్పం అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఆ పోర్టల్‌ వుంచుతారు. గ్రామపంచాయతీల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఇ-సేవా సదుపాయాలు కలిగితే కుప్పం హైటెక్‌ గా మారిపోవడం తధ్యం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X