వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఐటి సంస్థల లాబీయింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అమెరికాతో వ్యాపారం చేస్తున్న భారతీయ ఐటి కంపెనీలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వంతో పెద్దఎత్తున లాబీయింగ్‌ జరిపే కార్యక్రమం చేపట్టాయి. ఇందుకోసం ఎన్‌ఐఐటి సారధి విజయ్‌ టండానీ నేతృత్వంలో భారతీయ ఐటి సంస్థలు ఒక సంఘంగా ఏర్పడ్డాయి.

ఇందులో విప్రో, ఇన్ఫోసిస్‌, సత్యం, హెచ్‌సిఎల్‌ వంటి బడా సంస్థలు కూడా చేరాయి. సభ్యు సంస్థలు సమకూర్చే నిధులతో ఈ సంఘం లాబీయింగ్‌ నిర్వహిస్తుంది.సెప్టెంబర్‌ 11 తర్వాత అమెరికాలో భారతీయ సంస్థలకు వాతావరణం కొంత ప్రతికూలంగా మారింది. కాశ్మీర్‌ ఉద్రిక్తతల వల్ల పరిస్థితి మరింతవిషమించింది. చైనా సంస్థలు పెద్దఎత్తున రంగంలోకి దిగి పోటీ ఇస్తున్నాయి. ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితి వల్ల భారతదేశ పర్యటనకు వెళ్లే టూరిస్టులను జాగ్రత్తాఅంటూ, అమెరికా హెచ్చరించడంతో వాతావరణం మరింత ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌ పట్ల, భారత ఐటి కంపనీల పట్ల సానుకూల వైఖరి సృష్టి కోసం లాబీయింగ్‌ అనివార్యంగా మారింది. నాస్కామ్‌ ఈ పని చేస్తున్నప్పటికీస్వయంగా ఐటి కంపెనీలే సొంత సంఘంతో ముందుకు రావడం గమనార్హం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X