వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక మండలాలే ప్రాతిపదిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వెనకబడిన ప్రాంతాలను గుర్తించడానికి ఇకనుంచి మండలాలను ప్రాతపదికగా తీసుకోనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అభివృద్ధి చెందిన జిల్లాల్లో సైతం వెనకబాటు తనం కారణంగా అలమటిస్తున్న మండలాలు వున్నాయని అదే విధంగా వెనకబడిన జిల్లాల్లో కొన్ని మండలాలు అభివృద్ధి సాధించాయని ఆయన చెప్పారు.

ఈ అసమానతల దృష్ట్యా ప్రభుత్వం వెనకబాటు తనాన్ని నిర్మూలించడానికి ఇకనుంచి మండలాలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులపై సోమవారం నాడు ఆయన త్రైమాసిక సమీక్ష జరిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి ఈ సమీక్షలు జరుపుతున్నారు. ఈ సమీక్ష కార్యక్రమానికి
ప్రారంభోత్సవం చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ప్రైవేట్‌ భాగస్వామ్యానికిపెద్దపీట వేయడం వల్ల గత కొద్ది ఏళ్లలో పరిస్థితి గణనీయంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని మరింతపెంచనున్నట్టుగా ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X