వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలో 836 మండలాల్లో కరవు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ లో 836 మండలాలలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో కరవు పరిస్థితిని చర్చించారు. రాష్ట్రంలో 80 శాతం మండలాలు తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. కరవుతోఅల్లాడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.

దుర్భిక్షంతో అలమటిస్తున్న రాష్ట్రానికి 810 కోట్ల రూపాయల సాయం ప్రకటించాలని, 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రానికిఅందించాల్సిందిగా రాష్ట్రం మంత్రివర్గం తీర్మానించింది. వ్యవసాయ విత్తనాలపై సబ్సిడీ కోసం వందకోట్లు, మంచినీటి కోసం 300 కోట్ల రూపాయల సాయంఅందించాల్సిందిగా మంత్రివర్గం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 181 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని,మిగిలిన మండాల్లో మైనస్‌ 48 శాతం వర్షపాతం నమోదైందని సమావేశంవివరాలను విలేకర్లకు వివరించిన సమాచారం మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు.

కరవు పరిస్థితితో పాటు కలెక్టర్ల సమావేశంలో లేవనెత్తిన పలుఅంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించారు. ముఖ్యమంత్రి గతంలో చేసిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేక పోయారంటూ కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని క్యాబినెట్‌ అభిప్రాయ పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X