3నుంచి ఆన్‌ లైన్‌రైల్‌ బుకింగ్‌

న్యూఢిల్లీః భారతదేశ వ్యాప్తంగారైలు టికెట్లను ఇక మీదట ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకొనే అవకాశం కలగనుంది. ఈ నెల 3 నుంచి ఆన్‌ లైన్‌రైలు టిక్కెట్ల బుకింగ్‌ ను ప్రారంభించనున్నట్లు కేంద్రరైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం వల్ల ఇంటర్నెట్‌ యూజర్లు సునాయాసంగా టికెట్లు బుక్‌ చేసుకొనే అవకాశం వుంటుంది.

దీనివల్ల సమయం ఎంతో ఆదా అవుతుందని ఆయన చెప్పారు. ఆన్‌ లైన్‌ లో క్రెడిట్‌ కార్డు నెంబర్‌ ఇవ్వడం ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ నెల 6 నుంచి చెన్నై -విజయవాడ మధ్య జనశతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ ప్రారంభం కానున్నదని ఆయనవివరించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+