వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం హామీలపై వైఎస్‌ ఉద్యమభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

కడపః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడేళ్లుగా రాష్ట్రప్రజలకు పలు హామీలి ఇచ్చారని, వాటిలో పది శాతం కూడా నెరవేర్చలేదంటూ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. నెరవేరని ముఖ్యమంక్రి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు సి.ఎల్‌.పి. నేతఅయిన వై.ఎస్‌. వెల్లడించారు. బుధ, గురువారాల్లో ఆయన కడపలో విస్తృతంగా పర్యటించి శంఖుస్థాపనలతో నిలిచిపోయిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించారు. నెరవేరని సిఎం హామీలపై ఈ రెండేళ్ళలో విస్తృతంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆయనవివరించారు.

ఈ ఉద్యమాన్ని నాలుగు దశలుగా చేపడతామని ఆయనవివరించారు. మొదటి దశలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని, రెండో దశలో ధర్నాలు, మూడో దశలో ఎమ్మెల్ల్యేల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయనవివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈఅంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని ఆయన వివరించారు.

వై.ఎస్‌. ఇలా ఉద్యమభేరి మోగించగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయనవిమర్శలను తేలిగ్గా కొట్టిపారేసింది. ఏ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాన్ని ఏడేళ్ళు పరిపాలించలేదు... మమ్మల్ని చూసి కళ్ళు కుట్టి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని సమాచారం శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డివిమర్శించారు. సి.ఎం. ఇచ్చిన హామీల్లో 80 శాతం హామీలను నెరవేర్చామని,మిగిలిన హామీలను కూడా నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X