వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికేర్‌ రాజధానిగా భాగ్యనగరం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ ను మెడికేర్‌ రాజధానిగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు తనయుడు వెంకట్‌ అక్కినేనికిచెందిన బయోమెడ్‌ సంస్థ రూపొందించిన రెండు బయోమెడికల్‌ ఉత్పత్తులను చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆసియాలోనే మొట్టమొదటి సారిగా బయోమెడికల్‌ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారు మార్కెట్‌ లోకి తీసుకురావడం హర్షణీయమన్నారు.

మెడికల్‌ రంగంలో విదేశాలనుంచి ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీస్వదేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌ లో తయారయ్యేలా కృషి చేయాలని ఆయన ఫార్మాస్యూటికల్‌ కంపెనీలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ లో ఫార్మారంగంలో ఎందరో శాస్త్రవేత్తలు వున్నారు. వారందరి సహకారంతో నగరాన్ని మెడికేర్‌ రాజధానికి తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోఅక్కినేని నాగేశ్వరరావు, సినారె, వెంకట్‌ అక్కినేని, నాగార్జున, అమల తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X