వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుపీడిత రాష్ట్రాలకు 750 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కరవుతో విలవిల్లాడుతున్న వివిధ రాష్ట్రాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ తో సహా పలు రాష్ట్రాలలో తీవ్ర దుర్భక్ష పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈ అంశంపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో సోనియా గాంధీ సమావేశం కూడా నిర్వహించారు. అదే రోజున కరవుపై ఏర్పాటైన టాస్క్‌ ఫోర్స్‌ సారధి ఎల్‌.కె. అద్వానీ కరవు పీడిత రాష్ట్రాలకు 750 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

కరవు పీడిత రాష్ట్రాలకు ఇప్పటికే 400 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆగస్టు రెండోవారానికల్లా వర్షపాతం పరిస్థితి స్పష్టంగా తేలిపోతుందని అద్వానీ సారధ్యంలోని కరవుటాస్క్‌ ఫోర్స్‌ అభిప్రాయపడింది. ఆ తరువత పరిస్థితిని సమీక్షించి మరింత కరవు సాయంఅందించే విషయాన్ని పరిశీలిస్తామని అద్వానీ వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X