వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్‌ బంద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: తూర్పురైల్వే విభజనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోకపోవడాన్ని నిరసిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ తలపెట్టిన 24 గంటల పశ్చిమ బెంగాల్‌ బంద్‌ బంద్‌ సోమవారం ప్రారంభమైంది. సమాజ్‌వాదీ పార్టీ బంద్‌కు మద్దతు తెలిపింది. వామపక్షాలు బంద్‌ను వ్యతిరేకిస్తున్నాయి. బంద్‌కు మద్దతు తెలియజేయడం గానీ, బంద్‌ను వ్యతిరేకించడం గానీ చేయబోమని కాంగ్రెస్‌ ప్రకటించింది.

వ్యాపార సంస్థలను,విద్యాసంస్థలను మూసివేశారు. రోడ్లపై వాహనాలు చాలా పలుచగా తిరిగాయి. చాలా చోట్ల బంద్‌ సంపూర్ణంగా జరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రాష్ట్రంలో ప్రదర్శనలు నిర్వహించారు.రైల్లే రాకపోకలను ఆందోళనకారులు ఆపేశారు. తూర్పు రైల్వే విభజన నిర్ణయాన్ని మార్చుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రివర్గం ఆమె డిమాండ్‌ను త్రోసిపుచ్చింది. దీంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)కి 12 రోజుల గడువు ఇచ్చింది. ఈ లోగా ఆందోళనా కార్యక్రమాలకుశ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం పశ్చిమ బెంగాల్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X