కేంద్రానికి భారీ షాక్- లోక్ సభలో వీగిపోయిన మహిళా బిల్లు..!

కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ పార్లమెంట్ లో భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు చేపట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. ఈ మేరకు ఇవాళ లోక్ సభలో జరిగిన ఓటింగ్ లో బిల్లు పాస్ కావడానికి అవసరమైన 2/3 వంతు మెజార్టీ సాధించడంలో ఎన్డీయే సర్కార్ విఫలమైంది.

దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఇవాళ తిరస్కరించింది. ఓట్లు చీలిపోవడంతో ఈ ప్రతిపాదన వీగిపోయింది. ఓట్ల విభజన తర్వాత ఈ ప్రతిపాదన వీగిపోయింది, 298 మంది సభ్యులు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు 326 ఓట్లు అవసరం. ఈ ఓటింగ్‌లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు. శాసనసభలలో మహిళా కోటా అమలుకు కీలకమైన నిబంధన అయిన పునర్విభజన కోసం కొత్త జనాభా గణన అవసరాన్ని తప్పించుకోవడమే ఈ బిల్లు లక్ష్యం.

big shocker to nda in parliament women reservation bill defeated in lok sabha

ఈ బిల్లు ఆమోదానికి తగినన్ని ఓట్లు రాకపోవడంతో కేంద్రం తప్పనిసరి పరిస్దితుల్లో వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన చేశారు. అంతకు ముందు అధికార ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమి సభ్యులు బిల్లుపై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గాాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని విపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో తెలిపాయి. అయినా కేేంద్రం మాత్రం బిల్లులో పెట్టని 50 శాతం సీట్లు పెంపు నిబంధనను అమలు చేస్తామని పదే పదే చెప్పింది. అయినా లోక్ సభలో తగినంత మెజార్టీ సాధించడంలో విఫలం కావడంతో ఓడిపోయిన బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+