వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పటేల్‌అరెస్టుపై భిన్న కథనాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నిషిద్ధపీపుల్స్‌వార్‌ ముఖ్య నాయకుడు పటేల్‌ సుధాకర్‌ రెడ్డిఅరెస్టు కాలేదని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లోపీపుల్స్‌వార్‌ దళ సభ్యులు నలుగురు మృతి చెందినవిషయం తెలిసిందే. మిగిలినవారు నల్లమల కీకారారణ్యంలోకి పారిపోయారు.వీరిలో పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, మరో ముఖ్యుడు గుంటూరు జిల్లావిజయపురి సౌత్‌ వద్ద పోలీసులకు చిక్కినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ వార్తలను చూసిన ప్రజాసంఘాలు- పటేల్‌ సుధాకర్‌ రెడ్డిని వెంటనే కోర్టుకుహాజరు పరచాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వంతో జరిగే చర్చలకు సుధాకర్‌ రెడ్డిపీపుల్స్‌వార్‌ ప్రతినిధిగా హాజరు కావాల్సి వుండిందని, చర్చలు జరగలేదు కాబట్టి ఈఅరెస్టు అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం ఆయనతో చర్చలు జరిపితే బాగుంటుందని సూచించాయి. అయితే,అరెస్టు వార్తను డిజిపి రాములుతో పాటు గుంటూరు జిల్లా ఎస్‌పిసీతారామాంజనేయులు కూడా ఖండిస్తున్నారు. సరిహద్దు జిల్లా పోలీసులతో కలిసిఅరెస్టు చేసినవారిలో సుధాకర్‌రెడ్డి లేడనిసీతారామాంజనేయులు అన్నారు. నల్లమల అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో సుధాకర్‌ రెడ్డి ఉన్నమాట వాస్తవమేనని, అయితే, తమ సహచరులు నలుగురు మరణించిన వెంటనే కాలికి బుద్ధి చెప్పి ఉంటాడని డిజిపిఅంటున్నారు.

తమ కుమారుడైన పటేల్‌ సుధాకర్‌ రెడ్డిని పోలీసులు నిర్బంధించారని, ఎన్‌కౌంటర్‌పేరుతో తమ కుమారుడిని హతమార్చే ప్రమాదం ఉన్నదని సుధాకర్‌ రెడ్డి తలిదండ్రులు బొజ్జమ్మ, పటేల్‌ వెంకటరామి రెడ్డి ఆదివారం గద్వాలలోవిలేకరులతో అన్నారు. వెంటనే తమ కుమారుడిని కోర్టులోహాజరు పరచాలని వారు డిమాండ్‌ చేశారు. తమ కొడుకు ఏదైనా తప్పు చేశాడని భావిస్తే చట్ట ప్రకారం శిక్షించాలని వారన్నారు. తమ కుమారుడుఅరెస్టయినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రావడమే కాకుండా ఇతర మార్గాల ద్వారాఅరెస్టు వార్తను ధృవీకరించుకున్నామని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X