వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిని కలిసిన దేశం ఎంపిలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్ధితిని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.పి.లు మంగళవారం ప్రధానికివివరించారు. ఎర్రంనాయుడు సారధ్యంలోని తెలుగుదేశం ఎం.పి.ల బృందం ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నది. ఎం.పి.ల వెంట రాష్ట్ర మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు,అశోక్‌ గజపతిరాజు కూడా వున్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి తీవ్రంగా వున్నదని, భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయాలని వారు ప్రధానినికోరారు. రాష్ట్రానికి 80 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం ఇప్పటికే ప్రకటించినవిషయం విదితమే. అయితే 850కి పైగా మండలాల్లో కరవు నెలకొన్న దరిమిలా రాష్ట్రానికి 810 కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ కేంద్రాన్ని కోరింది.

సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో వారు ఢిల్లీలోనే వుండి ఎం.పి.లను వెంటపెట్టుకొని ప్రధానిని కలుసుకున్నారు. ప్రధాని నుంచి కూడా స్పష్టమైన హామీ లభించలేదు. అయితే కరవుటాస్క్‌ ఫోర్స్‌ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని వాజ్‌పేయి తెలుగుదేశం ఎం.పి.లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X