వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు ఆహారం అవుతున్న బియ్యం!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పనికి ఆహారపధకంలో జరుగుతున్న అవకతవకలపై తక్షణంవిచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి రోశయ్య బుధవారంవిలేకర్లతో మాట్లాడుతూ పనికి ఆహార పథకంలో జరుగుతున్న అవకతవకల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రుల హస్తం కూడా వున్నదన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పనికి ఆహారపథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారని అయితే ఆ లారీని వదిలపెట్టాల్సిందిగావిద్యుత్‌ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అధికారులను కోరారని రోశయ్య చెప్పారు.
విద్యుత్‌ మంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు పనికి ఆహారం పథకంలో జరుగుతున్న అవకతవకలతో సంబంధం వున్నదని ఆయన చెప్పారు. ప్రజల నోళ్ళు కొడుతున్న ఈ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ కోరింది. వారిని క్యాబినెట్‌ లో కొనసాగించడం చూస్తే ఈ అవకతవకలతో చంద్రబాబుకు కూడా సంబంధం వున్నట్లు అనుమానం వస్తున్నదని రోశయ్య అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X