వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుతేజాలకు నజరానా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు కైవసం చేసుకుని జాతీ ప్రతిష్టను ఇనుముడింపజేసిన తెలుగుతేజాలు నీలంశెట్టి లక్ష్మి, పూజరి శైలజలకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. క్రీడల శాఖ మంత్రి రాములు, శాప్‌ ఎండి సుబ్రహ్మణ్యం, ఒలంపిక్‌ సంఘం కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి పలువురు అధికారులు విమానాశ్రయంలో ఇద్దరు క్రీడాకారిణులకు ఘన స్వాగతం చెప్పారు.

కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలోశైలజ మూడు స్వర్ణాలను లక్ష్మి మూడు రజతాలనుకైవసం చేసుకున్న విషయం విదితమే. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లినశైలజ, లక్ష్మిని రాజభవన్‌లో గవర్నర్‌ రంగరాజన్‌ దంపతులు ఘనంగా సత్కరించారు. రాజ్‌భవన్‌ నుంచి నేరుగావీరిద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయంగాపెంచిన శైలజ, లక్ష్మీలను ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తారు.వీరికి పలు నజరానాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ మార్గంలోనే కేంద్రం కూడా క్రీడాకారులను నగదు బహుమతులు, నజరానాలతో ప్రొత్సహించడం పట్ల ఆయన హర్షంవ్యక్తం చేశారు.ఆంధ్ర క్రీడాకారిణులు సాధించిన ప్రతి స్వర్ణ పతకానికి పదిలక్షల రూపాయలు, రజత పతకానికి ఏడున్నర లక్షల రూపాయల చొప్పున బహుమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X