కరవుపోయాక కేంద్రబృందం వస్తుందా?

విశాఖపట్నంః కరవుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ పై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా కరవు సాయంఅందించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని అయినా కేంద్రం సరిగా స్పందించడం లేదని ఆయన అన్నారు. చదువుల పండుగలో భాగంగా గురువారం ఆయనవిశాఖపట్న జిల్లా ఆనందవరం గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడువిలేకర్లతో మాట్లాడారు.

విలేకర్లు కరవు సాయం గురించి ప్రస్తావించగా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో కరవు తీవ్రంగా వున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. తీరా కరవు తగ్గిపోయాక వచ్చి రాష్ట్రంలో కరవు ఎక్కడిది అని ప్రశ్నిస్తారని ఆయనవిమర్శించారు. ఆలశ్యం చేయకుండా కరవు బృందం రాష్ట్రంలో పర్యటించగలదన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. పనికి ఆహార పధకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ పథకంలో అవకతవకలు జరిగాయంటూకాంగ్రెస్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఆయన ఆక్షేపించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+