వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో అదే ప్రతిష్టంభన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పెట్రోల్‌ పంప్‌ల స్కామ్‌పై పార్లమెంట్‌ ఉభయసభలు గురువారం అయిదోరోజు కూడా స్తంభించిపోయాయి. ఇప్పటివరకు పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు గురువారం నాడు ప్రధాని వాజ్‌పేయి రాజీనామాకు డిమాండ్‌ చేశాయి. రాజ్యసభ సమావేశమైన అయిదునిమిషాల్లోనే శుక్రవారం నాటికి వాయిదా పడింది.

సభ ప్రారంభం కాగానే సభ్యులు గొడవ ప్రారంభించడంతో డిప్యూటి చైర్మన్‌ నజ్మా హెప్తుల్లా సభను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. లోక్‌సభలో సభను కొనసాగించేందుకుస్పీకర్‌ మనోహర్‌జోషి శతప్రయత్నాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్నివిపక్షాలు అడ్డుకున్నాయి. ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రక్షణ మంత్రి జార్జ్‌ లేచిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలుఅరుపులతో సభ మధ్యలోకి దూసుకువచ్చారు. వారిని అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో సభను శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్టుగాస్పీకర్‌ జోషి ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X