వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్‌ పై కాంగ్రెస్‌ రాద్ధాంతంః వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃపెట్రోలు బంకుల వ్యవహారంపై పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపచేస్తున్న ప్రతిపక్షాలపై బిజెపి అధ్యక్షుడుఎం. వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కావాలని బురదచల్లుతున్నారని ఆయన గురువారం జరిగినవిలేకర్ల సమావేశంలో ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌,అస్సాం, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎం.పిలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతంరం వెంకయ్య నాయుడువిలేకర్లతో మాట్లాడారు. విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కానీ రోజుల తరబడి పార్లమెంటును స్తంభింపచేయడంఅర్థరహితం అని ఆయన అన్నారు. వాజ్‌ పేయి పెట్రోల్‌ బంకుల కేటాయింపులను రద్దు చేశారు కాబట్టి రాం నాయక్‌ తప్పు చేసినట్లే అనుకోవాలి కదా అనివిలేకర్లు ప్రశ్నించగా అందుకు వెంకయ్య నాయుడు సమాధానం దాటవేశారు. తప్పు చేసిన రాం నాయక్‌ ను తప్పుకోమంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌ ఎలా అనుచితం అవుతుందనివిలేకర్లు ఆయనను నిలదీశారు. ఈ ప్రశ్నకు కూడా వెంకయ్య నాయుడు సూటిగా సమాధానం ఇవ్వలేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X