వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతలైనాసరే వదలం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పిల్లల చేత పని చేయించుకుంటే రాజకీయ నాయకులనైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చదువుల పండుగ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని చంచల్‌గుడా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

అధికారులు, రాజకీయ నేతలు పిల్లల చేత తమ ఇళ్లలో పని చేయించుకుంటే అలా పని చేయించుకున్నవారిని కూడా వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. భారీ జరిమానాలు వేస్తామని ఆయన హెచ్చరించారు. చదువుల పండుగలో భాగంగా 3.50 లక్షల మందిని తిరిగి పాఠశాలలో చేర్పించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో పని చేసున్న పిల్లల్లో 40 శాతం మంది ఇళ్లలో పని చేస్తున్నవారేనని ఆయన అన్నారు. పని చేస్తున్న పిల్లలకు ఇచ్చే జీతానికి నాలుగింతలు వారి చేత పని చేయించుకుంటున్నవారి నుంచి జరిమానాగా వసూలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాసిక్యూట్‌ కూడా చేస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X