వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రమేయం లేదు:విద్యాసాగర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పెట్రోల్‌ పంపుల కేటాయింపులో తన ప్రమేయం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిసిహెచ్‌. విద్యాసాగర రావు స్పష్టం చేశారు. పెట్రోల్‌ డీలర్లపేర్ల చివర రావు అని ఉన్నవారందరూ తన వారని అనుకోవడం సరికాదని, అటువంటి వారితో తనకు ప్రమేయం లేనది ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

తన పేరు మీద గానీ, తన కుటుంబ సభ్యులపేర్ల మీద గానీ ఒక్క పెట్రోల్‌ పంపు కేటాయింపు కూడా లేదని ఆయన అన్నారు. ఈవిషయమై తాను ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికివివరించానని, ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తనఇరవై యేళ్ల రాజకీయ జీవితంతో తనపై అవినీతి ఆరోపణలు,వివాదాలు లేవని ఆయన అన్నారు.

దున్నగలిగే వానికి భూమి రెండవ దశ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి విడత కార్యక్రమంలో జరిగిన లోపాలను, అవకతవకలను రెండవ విడత కార్యక్రమంలో జరగనివ్వబోమని ఆయన అన్నారు. రెండవ విడత కార్యక్రమాన్ని కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం మర్పల్లిలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X