వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలాం పర్యటన పై కలవరం

By Staff
|
Google Oneindia TeluguNews

కలాం పర్యటన పై కలవరం
న్యూఢిల్లీః గుజరాత్‌లో పర్యటించాలని, అయోధ్యను సందర్శించాలని రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తీసుకున్న నిర్ణయం పట్ల ఎన్‌డిఎ నేతల్లో కలవరం వ్యక్తం అవుతున్నది. కలాం ధోరణి తెలిసిన ఎన్‌డిఎ నేతలు ఆయన పర్యటనకు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాట వినకుండా కలాం గుజరాత్‌ పర్యటనకు పట్టుబడితే ఎలా అని సీనియర్‌ నేతలు కలవర పడుతున్నారు..

గుజరాత్‌ పర్యటనలో అక్కడి పరిస్థితిపై కలాం ఏదైనా వ్యాఖ్య చేస్తే తమ పరువు మొత్తం గంగపాలవుతుందని ఎన్‌డిఎ నేతల భయం. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ పరిశీలకుల బృందం, ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ల బృందం గుజరాత్‌ పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిన నేపథ్యంలో కలాం పర్యటన వారికి ఆందోళన కలిగిస్తున్నది. ముక్కుసూటిగా మాట్లాడ్డం, నిక్కచ్చిగా తన మనోభావాలను వెల్లడించడం కలాం నైజం కావడంతో ఆయన ఏం మాట్లాడుతారోనని వారు భయపడుతున్నారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X