వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు నిరవధిక వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు నిర్ణీత గడువుకు ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి.పెట్రోల్‌ పంపుల కేటాయింపు కుంభకోణంపై ప్రతిపక్షాలు తమ పట్టువీడకుండా గందరగోళం సృష్టిస్తుండడంతో లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 14వ తేదీ వరకు జరగాల్సి ఉంది.

సోమవారం ఉదయం సమవేశం ప్రారంభం కాగానే లోక్‌సభలో ప్రతిపక్షాలుపెట్రోల్‌ పంపు కేటాయింపు కుంభకోణంపై గందరగోళం సృష్టించాయి. సభ సజావుగా నడవడానికి సహకరించాలనిస్పీకర్‌ మనోహర్‌ జోషీ చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు పట్టించుకోలేదు.పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్‌ రాజీనామా చేసేంత వరకు సహకరించబోమని స్పష్టం చేశాయి. దీంతో స్పీకర్‌ జోషీ- మరో రెండు రోజుల పాటు కార్యక్రమాలేవీ నిర్వహించకుండా సభను కొనసాగించడమా లేదంటే నిరవధికంగా వాయిదా వేయడమా అనే రెండు అవకాశాలు మాత్రమే తన ముందున్నాయని అన్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ సామరస్యాన్ని సాధించలేకపోయినందున సభను నిరవధికంగా వాయిదా వేయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణం కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లిస్పీకర్‌తో వాదనకు దిగారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X