వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎకు మమత హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తూర్పు రైల్వే విభజనపై కేంద్రంతో ఘర్షణకు దిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్‌డిఎ నుంచి దూరం జరుగుతున్నట్టుగా ప్రకటించారు. తూర్పు రైల్వే విభజన వ్యవహారంపై కేంద్రం సరైన రీతిలో స్పందించి తమకు సంతృప్తి కలిగేట్టుగా సమస్యను పరిష్కరించేవరకు తాము
ఎన్‌డిఎకు దూరంగా వుంటామని ఆమె ప్రకటించారు.

ఈ మేరకు పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ప్రధాని వాజ్‌పేయిపై తమవిశ్వాసం ఇప్పటికీ చెక్కుచెదరలేదని మమత వెల్లడించారు. ఎన్‌డిఎ చిక్కుల్లో పడితే తమ పార్టీ తప్పకుండా ఆదుకుంటుందని ఆమె తెలిపారు. ఎన్‌డిఎసీనియర్‌ నేతలను కలసి తమ పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ఇదిలా వుండగా ఎన్‌డిఎకు దూరం జరగాలన్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాల్సిందిగా బిజెపి నేతలు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతనుకోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X