వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ వాడుతున్న ప్రత్యేకవిమానానికి సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. దీంతో న్యూఢిల్లీ నుంచిఎయిర్స్‌ఫోర్స్‌ బోయింగ్‌ 737 విమానం బయలుదేరింది.

కలామ్‌ ఉదయం గం.10.15 నిమాషాలకు భూకంపం తాకిడికిగురైన భుజ్‌కు బయలుదేరారు. వాస్తవానికి ఆయన ఉదయం 8 గంటలకే బయలుదేరాలి.విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆయన పర్యటనలో జాప్యం జరిగింది. దీంతో తన కార్యక్రమంలో మార్పులు చేసుకున్నారు.

అహింసను ప్రబోధిస్తున్న గాంధీ నగర్‌ సమీపంలోని ప్రేషక్‌ భారతి సంస్థను ఆయన సందర్శించారు.స్వామినారాయణ్‌ సంప్రదాయానికి చెందిన దేవాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఆయన మత గురువు ప్రముఖ్‌స్వామిని కలుసుకున్నారు. నిపుణులు విమానం సాంకేతిక లోపాన్ని గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X