వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై మండిపడిన సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పనికి ఆహారం పథకం కింద రాష్ట్రానికి బియ్యం అందకుండా కాంగ్రెస్‌ అడ్డుపడుతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరవు వాతపడిన రాష్ట్రానికి కాంగ్రెస్‌ పెద్ద సమస్యగా తయారయిందని ఆయన విమర్శించారు.

పొరుగున వున్న కర్ణాటక నుంచి రాష్ట్రానికి ఇబ్బందులు వస్తున్నా కాంగ్రెస్‌ నేతలు ఆ రాష్ట్రాన్నే వెనకేసుకువస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీలో కూడా సమస్యలను సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. కరవుపై అనంతపురంలో సభలుపెట్టి గగ్గోలు చేసిన కాంగ్రెస్‌వారే కరవు పీడిత ప్రజలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన పనికి ఆహారం పథకాన్ని అడ్డుకుంటున్నదని ఆయన అన్నారు. ప్రజలు బాగుపడుతంటే కాంగ్రెస్‌ఓర్వలేకపోతున్నదని ఆయన అన్నారు. ఈ స్కీమ్‌లో అక్రమాలు జరిగాయని భావిస్తే కేంద్ర ప్రభుత్వమే నేరుగా దర్యాప్తు చేసుకోవచ్చని ఆయన సవాలు చేశారు. కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X