వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు మాటలు నీటిమూటలుః రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదంటూ చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి రోశయ్య ఆరోపించారు. చంద్రబాబు గ్రామాలకు వెళ్ళి చూస్తే బండారం బయటపడుతుందన్నారు. సోమవారం ఆయన వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే మాటకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కట్టుబడి వున్నదని ఆయన చెప్పారు.

పనికి ఆహారం పథకంలో జరుగుతున్న అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పథకంలో అక్రమలకు పాల్పడుతున్న వారిలో కాంగ్రెస్‌ వారు వున్నా శిక్షించవచ్చునని ఆయన చెప్పారు. పనికి ఆహారం పథకంపై మేం చేస్తున్నివిమర్శలకు సమాధానం చెప్పలేక ఈ పథకాన్ని రద్దు చేయించాలన్నదే కాంగ్రెస్‌ పన్నాగంఅంటూ అర్థంలేని ప్రత్యారోపణలు చేస్తున్నారని రోశయ్యవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X