విద్యాసాగర్‌ సభలో గలభా

అనంతపురంః కేంద్ర హోం శాఖ సహయమంత్రి పాల్గొన్న సభలో కొందరువిద్యార్థులు రభస సృష్టించి కలకలం సృష్టించారు. సోమవారం అనంతపురంలో కేంద్రీయ పాఠశాల ప్రారంభ సభలోవిద్యాసాగర్‌ రావు పాల్గొన్నారు. ఇటీవల వెలుగుచూసినపెట్రోల్‌ బంకుల కుంభకోణంతో ప్రమేయం వున్నవిద్యాసాగర్‌ రావు రాజీనామా చేయాలని కోరుతూ కొందరు యువకులు సభలోనే నినాదాలు ఇచ్చారు. వారిని శాంతపరిచేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళారు.

ఆ తరువాతవిద్యాసాగర్‌ రావు ఆవేశంగా మాట్లాడుతూ నిజానిజాలు వెల్లడికాక ముందే ప్రజాప్రతినిధులపై ఇలా బురదచల్లడం సబబుకాదన్నారు. ఆధారాలు లేని ఆరోపణలకు మీడియా అధికప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదనగా అన్నారు.పెట్రోల్‌ బంకులు కుంభకోణంలో విద్యాసాగర్‌ రావు కోట్లు దండుకున్నారని ఆరోపణలు వచ్చినవిషయం విదితమే. ఈ వ్యవహారంపై బహిరంగసభలో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంవిశేషం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+