వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీమ్‌కు నివేదన: రాష్ట్రపతి ఓకె

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికలు వెంటనే నిర్వహించే పరిస్థితులు లేనందున గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే ఎన్నికల కమీషన్‌ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ ఆమోద ముద్ర వేశారు. లండన్‌కు బయలుదేరే ముందు ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ మంగళవారం ఉదయంవిలేకరులకు ఈ విషయం చెప్పారు.

ప్రభుత్వ ప్రతిపాదనపై సంతకం చేసి రాష్ట్రపతి దాన్ని తిరిగి పంపారని, వెంటనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రదిపాదనలో మూడుఅంశాలున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విషయంలో ఎన్నికల కమీసన్‌ నిర్ణయం 174వ ఆర్టికల్‌కు విఘాతం కాదా, ఎన్నికల కమీషన్‌ రాష్ట్రపతి పాలనకు సిఫారిస్‌ చేయవచ్చా, 174వ ఆర్టికల్‌కు భంగం కలగుకండా ఎన్నికల కమీషన్‌ విధులు నిర్వహించాల్సి లేదా అనే ప్రశ్నలను లేవనెత్తుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకువెళ్లనుంది.గుజరాత్‌లో ఇప్పుడే ఎన్నికలు నిర్వహించకూడదని ఎన్నికల కమీషన్‌ తీసుకున్న నిర్ణయంపై సలహా కోరుతూ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ప్రతిపాదన సుప్రీంకోర్టుకుఅందింది. ఈ ప్రతిపాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌. కృపాల్‌ ఉంచుతారని, కృపాల్‌ ఈవిషయాన్ని తగిన బెంచ్‌కు సిఫార్సు చేస్తారని రిజిస్ట్రార్‌ జనరల్‌ఆర్‌.సి. గాంధీ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X