వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌ లో పటేల్‌విగ్రహావిష్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః ఉక్కుమనిషిగాపేరొందిన సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ కాంస్య విగ్రహాన్నిభారత్‌ ఉపప్రధాని అద్వాని గురువారం లండన్‌ లో ఆవిష్కరించారు. ఈవిగ్రహావిష్కరణ సందర్భంగా బ్రిటన్‌ లో పాక్‌ మద్దతు దారులు అద్వానీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. గుజరాత్‌ లో ఇటీవల జరిగిన మత ఘర్షణలకు బిజెపియే కారణంఅంటూ వారు అద్వానీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దక్షిణాసియా సాలిడారిటీ,బ్రిటన్‌ లోని ఇండియన్‌ ముస్లిం కౌన్సిల్‌ కు చెందిన 20 మంది కార్యకర్తలు ఈ నినాదాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన అద్వానీ పటేల్‌ కు ఘన నివాళులుఅర్పించారు. భారత తొలి హోం మంత్రి అయిన పటేల్‌సమైక్యభారతదేశ రూపకల్పనకు ఎంతో శ్రమించారని అద్వానీ కొనియాడారు. ఈ కార్యక్రమంలోబ్రిటన్‌ లో భారత్‌ రాయబారి సేన్‌ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లక్షలసంఖ్యలో వున్న ప్రవాసభారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వారిక్‌ ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించేవిషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తున్నదని అద్వానీ ఈ సందర్భంగా చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X