వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమవరంలో కొలువైన కమలనాధులు

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః రెండు రోజులపాటు జరిగే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారంపశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చిలకం రామచంద్రరావు సారధ్యంలో సమావేశం జరుగుతున్నది. రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు వి. రామారావు, విద్యాసాగర్‌ రావు, సినీనటుడు కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనికి ఆహారపధకంలో జరుగుతున్న అవకతవకల పట్ల బిజెపి కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు అడ్డు చెప్పాలనిసమావేశం సూచించింది.

నిరుపేదలను ఆదుకొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్న బియ్యం రాజకీయ నాయకులు పరం కావడం ఆందోళనకరమని చిలకం రామచంద్రరావు అన్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ బిజెపిని అన్ని విధాలా చిన్న చూపు చూస్తున్న వ్యవహారాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుందని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X