భూకబ్జా నిజం కాదు: వెంకయ్య
విశాఖపట్నం: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తాను భూకబ్జాకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడికి వచ్చిన ఆయన కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా నిందలు మోపడం సరి కాదని ఆయన అన్నారు. ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
