వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఈ నెల 26వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. చేర్పులు, మార్పులుస్వల్పంగానే ఉంటాయని భావిస్తున్నారు.

విద్యుత్‌ మంత్రిసురేష్‌ ప్రభు రాజీనామా చేయడం వల్ల, బిజెపికి చెందిన కొందరు మంత్రులకు పార్టీ పదవులుఅప్పగించాలని అనుకుంటుండడం వల్ల ఈ పునర్యవస్థీకరణను చేపడుతున్నట్లు సమాచారం. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సురేష్‌ ప్రభు రాజానామాను ఆమోదించి, రాష్ట్రపతివీలును బట్టి ఈ నెల 26న మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేస్తారనిఅంటున్నారు.

తాను శివసేన అధినేత బాల్‌ థాకరేతో మాట్లాడినట్లు,సురేష్‌ ప్రభు రాజీనామాను అంగీకరించాలని ఆయన గట్టిగా చెప్పినట్లు ప్రధాని వాజ్‌పేయి శుక్రవారంనాడువిలేకరులతో చెప్పారు. శివసేనకు చెందిన ఆర్థిక సహాయ మంత్రి అనంత్‌ గీతేకు క్యాబినెట్‌ హోదా కల్పించి ఆయనకువిద్యుచ్ఛక్తి శాఖను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. శివసేనకు చెందిన దళిత ఎంపి ఆనందరావు అద్సుల్‌కు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి.

క్రీడల మంత్రి ఉమాభారతికి, ప్లానింగ్‌, పర్సనల్‌ శాఖల సహాయ మంత్రి వసుంధర రాజె సింథియాకు పార్టీ బాధ్యతలుఅప్పగించనున్నట్లు సమాచారం. ఆమెకు మధ్యప్రదేశ్‌ పార్టీ అధ్యక్ష పదవిని, వసుంధర రాజె సింథియాకు రాజస్థాన్‌ పార్టీ అధ్యక్ష పదవినిఅప్పగిస్తారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X