వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌ డబుల్‌సెంచరీ మిస్‌: భారత్‌ 628/8

By Staff
|
Google Oneindia TeluguNews

లీడ్స్‌: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ డబుల్‌సెంచరీ మిస్సయ్యాడు. టెండూల్కర్‌ 193 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాడిక్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. శుక్రవారంనాడు 185 పరుగులతో నాటౌట్‌గా ఉన్న అతను శనివారం కొద్దిసేపటికే అవుటయ్యాడు.

భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ఎనిమిదివికెట్లకు 628 పరుగులు చేసి భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను భోజనవిరామ సమయానికి ముందే డిక్లేర్‌ చేసింది. శనివారం ఆట ముగిసే సమయానికి నాలుగువికెట్లు మాత్రమే కోల్పోయి 584 పరుగులు చేసిన భారత్‌ శనివారం వెంటవెంటనేవికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లకు దిగి తమవికెట్లను జార విడుచుకున్నారు. వివియస్‌ లక్ష్మణ్‌ 6,అగార్కర్‌ 2, హర్బజన్‌ సింగ్‌ 18 పరుగులు చేసి అవుటయ్యారు. కాడిక్‌కు మూడువికెట్లు దక్కాయి. శుక్రవారంనాడు సచిన్‌, గంగూలీ చెలరేగి ఆడారు. ఇంగ్లాండు బౌలర్లు వేసిన బంతులను చీల్చి చెండాడారు.సిక్స్‌లు, ఫోర్లతో భారత్‌ స్కోర్‌ బోర్డును పరుగులెత్తించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X